Header Banner

ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్‌… ఆ నమోదు తప్పనిసరి! ఖాళీలు భర్తీకి ప్రణాళిక సిద్ధం!

  Sun Apr 06, 2025 10:08        Employment

ప్రభుత్వ ఉపాధ్యాయులకు వచ్చే మే నెలలో బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వారి బదిలీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మొదటిసారి ఈ చట్టం ప్రకారం బదిలీలు చేయబోతున్నారు. జీఓ-117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానం తీసుకురాబోతున్నారు. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1-5 తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియ 95% పూర్తయింది. 430 బడులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 30 నాటికి ముగిసే అవకాశం ఉంది.
సీనియారిటీ జాబితాల విడుదల
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను ఈ నెల 20 నాటికి పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాటిని విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. మరోసారి సరిచూసుకొని, తుది జాబితాలను విడుదల చేస్తారు. మరోపక్క ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆదర్శ పాఠశాలలకు పోస్టుల సర్దుబాటు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే బడులకు పోస్టులను మార్పు చేస్తారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న అనంతరం పాఠశాలల్లో పోస్టులపై స్పష్టత వస్తుంది. దీనిప్రకారం బదిలీలు చేపడతారు.
• మే మొదటి వారంలో బదిలీలకు ప్రకటన విడుదల చేస్తారు. ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహిస్తారు.ఖాళీల ఆధారంగా ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాలి. ఒక టీచర్ ఎన్ని ఖాళీలకైనా ఐచ్ఛికాలు పెట్టుకోవచ్చు. వారి సీనియారిటీ, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు.య తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకోకూడదు. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారు తమకు నచ్చిన వాటితోపాటు తమ పాఠశాలను కూడా ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు.
• మొదట ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపడతారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు.
• స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తారు
• చివరిగా ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలే ఖాళీలు డీఎస్సీలో వచ్చే కొత్తవారితో భర్తీ చేసే అవకాశం ఉంది.
• బదిలీలను మే 30 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TeachersTransfers #AndhraEducation #SchoolTransfers #TeacherVacancy #EducationReforms